కాటారం నేటి ధాత్రి
కాటారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటారం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఇన్నాళ్లకు తీర్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కాటారం రెవిన్యూ డివిజన్ అధికారిగా నియమితులైన నారాయణ కు స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగరాజు, బిఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎంపీటీసీ తోట జనార్ధన్, సర్పంచ్ తోట రాధమ్మ, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు కిరణ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కుడుదుల రాజబాపు తదితరులు పాల్గొన్నారు…