సమానత్వ ధర్మం రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి

హన్మకొండ జిల్లా:నేటిధాత్రి

సనాతన ధర్మం లో సమానత్వం లేదని సాటి మనిషిని మనిషిగా చూడని ఆధిపత్య అశాస్త్రీయ సంస్కృతి ఉందని సమానత్వ ధర్మం రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించటం నేటి తరం కర్తవ్యం కావాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు సోమవారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవీపీఎస్25వసంతాల ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సనాతన ధర్మమా రాజ్యాంగ ధర్మమా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు కేవీపీఎస్ జిల్లా ప్రదాన కార్యదర్శి మంద సంపత్ అధ్యక్షతన సెమినార్ లో ప్రధాన వక్తగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు హాజరయ్యారు .
ఆయన స్కైలాబ్ బాబు మాట్లాడుతూ సనాతన ధర్మం ఆశాస్త్రీయమైనదని రాజ్యాంగ ధర్మమే సర్వోన్నతమైనదని అన్నారు.
సనాతన ధర్మమా రాజ్యాంగ ధర్మమా ఈ దేశానికి ఏ ధర్మం అవసరం అనేది ప్రతీ ఒక్కరు చర్చించాలన్నారు తమిళనాడులో ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం డెంగ్యూ,మలేరియా లాంటి జబ్బులతో సమానం అని ఆ జబ్బులని ఏలాగైతే వదిలించుకుంటామో ఈ సనాతన అధర్మాన్ని కూడా ఈ దేశం నుంచి వదిలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.పరమహంస స్వామి సన్యాసి సనాతన ధర్మం మీద వ్యాఖ్యానించిన ఉదయనిది స్టాలిన్ తలనరుక్కొని తల పట్టుకొచ్చినటువంటి వాళ్లకి 10 కోట్ల రూపాయలు ఇస్తామని సుఫారీ ప్రకటించడం విచారకరం అతనిని తక్షణమే అరెస్ట్ చేసి జైలులో ఎందుకు పెట్టలేదన్నారు సనాతన ధర్మం గురించి రోజు వల్లించేటువంటి వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని పాటించడం అసాధ్యమన్నారు ఆ ధర్మాన్ని పాటిస్తే ఈ దేశం అధోగతి పాలవుతుందని ఆధునిక యుగం వైపు దేశం ముందుకు సాగాలంటే రాజ్యాంగ ధర్మం కావాలన్నారు
సనాతన ధర్మం అంటే హిందు మతంలోనే కాదు,ముస్లిం మతంలోను,క్రిస్టియన్ మతంలో కూడ అంతరాలను పెంచి పోషిస్తున్నటువంటి సనాతన భావాలు ఉన్నాయన్నారు.
ముస్లిం మతంలో మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే విడాకులు అయిపోయినట్టే అంటే ఇది కూడా ఈ దేశానికి పనికి రాదన్నారు సనాతన అంటే పురాతనమైందని,ఆది అంతం లేనిదని చెబుతారని ఈ దేశంలో అలా ఏది ఉండదన్నారు సనాతన ధర్మంలో భర్త చనిపోతే బ్రతికి ఉన్న భార్యను కూడా చితిలో వేసి కాలబెట్టడం వంటి సనాతన ధర్మము ఈ దేశానికి అవసరం లేదన్నారు ధర్మాన్ని ఆధునిక యుగంలో అంగీకరిస్తామా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం ప్రకారంగా మహిళా అంటే మనిషి కాదన్నారు.సనాతన ధర్మంలో స్త్రీ అంటే ద్వితీయ శ్రేణి పౌరురాలుగా వంటింటి కుందేలుగా పడి ఉండాలన్నారు సనాతన ధర్మం ప్రకారం అయితే ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రదాని,మాయావతి,మమతాబెనర్జీ ముఖ్యమంత్రులు కాలేన్నారు
సనాతన ధర్మంలో మనిషి పుట్టుక కూడా అశాస్త్రీయమేనన్నారు .మానసిక చట్టాల బంధనాల నడుమ ఈ దేశం నలిగిపోతున్నదన్నారు మనుషులు రాజ్యాంగ ధర్మానికి కట్టుబడి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర బీజేపీ సర్కార్ ప్రజల మనోభావాలను అడ్డం పెట్టుకొని అధికారం చేలాయిస్తుందన్నారు దళితులు మహిళలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తుందన్నారు
కేవీపీఎస్ గత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితుల పక్షాన పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు ఎస్సి ఎస్టీ కమీషన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, 1235 జీవ ప్రకారంగా దళితులకు రెండెకరాల స్మశాన భూమి కోసం , 342 జీవో ప్రకారంగా విద్యుత్ దళితుల ఇండ్లకు 100 యూనిట్లు ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, సింగారపు రవి ప్రసాద్
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ నాయకుడు కొమ్ముల బాబు ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకుడు కోరిక ఈశ్వర్ సింగ్ నాయక్ మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు మన్నే బాబురావు జిల్లా నాయకుడు రామచందర్ ఎంఆర్పిఎస్ జిల్లా కా అధ్యక్షులు గద్దల సుకుమార్ సిఐటియు జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, ఆలకుంట్ల యాకయ్య ,మల్లయ్య ఐద్వా జిల్లా నాయకురాలు శ్వేత డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నోముల కిషోర్ డి తిరుపతి రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కంచర్ల కుమారస్వామి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాలకొండ శ్రీకాంత్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ జిల్లా నాయకులు కనకం కావ్య శ్రీ
ఆర్షం రాంకి, గడ్డం అశోక్ మామిడి రమేష్ రేణికుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!