ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

 

రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో రెనే హాస్పిటల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుండి ప్రజలు లైన్ కట్టి డాక్టర్స్ వద్ద వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రబలత మాట్లాడుతూ ఇటీవల ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ జ్వరాలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈరోజు రేనే హాస్పిటల్ ఆధ్వర్యంలో మన గ్రామంలో ఇలాంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్. భవానీ మరియు నర్సింగ్ స్టాప్, మార్కెటింగ్ హెడ్ సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *