సేవారత్న నేషనల్ అవార్డుకి ఎంపికైన కొయ్యడ కుమారస్వామి

 

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రతి ఏటా బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సామాజిక సేవ సంఘసంస్కర్తలకు అందిస్తున్న అవార్డులలో భాగంగా భారత జాగృతి వికలాంగుల సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ నేషనల్ సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ శనివారం హైదరాబాదులో ఆహ్వాన పత్రికను అందజేశారు. కొయ్యడ కుమార స్వామి తాను సంఘ సేవ ద్వారా జిల్లాలోనీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యంగులకు చేస్తున్న సేవలను గుర్తించి సేవా రత్న నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని బి.ఎస్.ఏ. జాతి అధ్యక్షులు రాధాకృష్ణ తెలిపారు. సేవా రత్న నేషనల్ అవార్డుకి ఎంపికైన కొయ్యడ కుమారస్వామి ఈనెల 15వ తేదీన ఢిల్లీలో నిర్వహించే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ అవార్డున అందుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *