ఉత్తమ సామాజిక, హక్కుల, కార్యకర్త అవార్డు అందజేత

మందమర్రి, నేటిధాత్రి:-

సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతే కు ఉత్తమ సామాజిక, హక్కుల, కార్యకర్త అవార్డును జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ నుండి స్వీకరించడం జరిగింది. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ చేతుల మీదుగా శుక్రవారం రాజలింగు మోతే స్వీకరించారు. అంతకు ముందు కమిషన్ సభ్యునిగా ఎన్నికైన ప్రవీణ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజలింగు మోతే మాట్లాడుతూ, తనను గుర్తించి ఇండియన్ ఐకాన్ అవార్డు ప్రదానం చేసిన జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *