నర్సంపేట,నేటిధాత్రి :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నర్సంపేట శాక అధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని అమర వీరుల స్తూపం వద్ద టీఎస్పీఎస్సీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, గ్రూప్ -1పరీక్ష రద్దుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, టీఎస్పీఎస్సీ తప్పిదాలకు బాధ్యులైన వ్యక్తులపై న్యాయ విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని మండి పడ్డారు,అర్హులైన అనుభవం వున్నా వ్యక్తుల్ని టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పొన్నాల శశి కుమార్, రాకం రాకేష్,కిషోర్, రాజుకుమార్, నగేష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ దిష్టి బొమ్మదగ్ధం
