కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.

అన్ని వర్గాలకు సముచిత స్థానం.
కుల సంఘాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయింపు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.

రామయంపేట (మెదక్)నేటి ధాత్రి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం రామాయoపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. చాలా గ్రామాల్లో సంఘం భవనం లేకపోవడం వల్ల ఎక్కడో రోడ్డు పక్కన లేదా చిన్న చిన్న గదుల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కుల సంఘాలకు స్థలం కేటాయించి భవనాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దీంతో సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐక్యతగా ఉండడానికి ఉపయోగపడతాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కుల సంఘాలను సమానంగా చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు పి ఎస్ సి ఎస్ చైర్మన్ బాదే చంద్రం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరప్ యాదగిరి కౌన్సిలర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!