వార్డులో ఆరోగ్య,ఆర్థిక సమస్యలు ఏమున్న మీముందు నేనున్నా

9వ వార్డు కౌన్సిలర్ పరిపూర్ణ చారి

నిత్యావసర సరుకుల వితరణ చేసిన కౌన్సిలర్ పూర్ణచారి

 

పరకాల నేటిధాత్రి(టౌన్)
శనివారం రోజున హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ 9వ వార్డులో గుంలపురం గట్టమ్మ అనే ఒక వృద్ధ మహిళ మరణించడం జరిగింది.వారి కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం వారి కుటుంబం ఇబ్బందిని గమనించిన స్థానిక కౌన్సిలర్ బెజ్జెంకి పూర్ణ చారి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం,నిత్యవసర సరుకులు తగిన ఆర్థిక సహాయం అందచేశారు.ఇలా వార్డులో ఎవ్వరికి ఎలాంటి ఆర్థిక, ఆరోగ్య పరమైన ఇబ్బంది ఉన్న పూర్ణ చారి తన సేవలను వార్డు ప్రజలకు అందిస్తూనే ఉంటున్నారు.ఈ కార్యక్రమంలో గట్టమ్మ కుమారుడు గుమలాపురం సమ్మయ్య, కోడలు సమ్మక్క,వారి మనమలు మరియు కాలనీవాసులు వెంకటేశ్వర్లు, మల్లేశం, నాగేశ్వరరావు, రాము,కడారి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!