అగ్నివీర్ కు సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎంపిక

-సైనిక స్కూల్ డైరెక్టర్ కల్నల్ వై. శ్రీనివాసరావు

ఖానాపూర్ నేటిధాత్రి

 

ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గిరిజన సంక్షేమ శాఖ అధ్వర్యంలో కొనసాగుతున్న సైనిక్ స్కూల్ అకాడమి కి చెందిన ఆరుగురు డిగ్రీ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం చదువుతున్న మరో ఆరుగురు విద్యార్ధులు.డి రాజు బిఎస్సి -మూడవ సంవత్సరం .ఎన్. భరత్ బిఎస్సి కె.భరత్ బిఎస్సి.కె.అనిల్ మరియు బి .నరేష్ రెండవ సంవత్సరం కె సంతోష్ అనే విద్యార్థులు ఏప్రిల్ 2023 లో జరిగిన వ్రాత పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జూన్ 2023 లో విడులదచేసిన మెరిట్ లిస్టులో నిలిచి దేహదారుఢ్య పరీక్ష కు ఎంపికైయ్యారు, సెప్టెంబర్ లో 1-7 తారీకు మధ్య ఖమ్మం లో జరగిన ర్యాలీ మరియు మెడికల్ దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అయ్యి సెప్టెంబర్ 25 న విడుదల చేసిన మెరిట్ కం సెలెక్టెడ్ లిస్ట్ కు ఎంపికయ్యారని కళాశాల డైరక్టర్ కల్నల్ ఎడ్ల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా డైరక్టర్ , కళాశాల ప్రిన్సిపాల్ బి .వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపల్ శేరి కుమార్ మరియు అధ్యాపక బృందం ఈ ఆరుగురు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా డైరక్టర్ మాట్లాడుతూ పేద, మరియూ గిరిజన విద్యార్ధులు గురుకులం ప్రోత్సాహంతొ, అకాడమీలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని వివిధ ఉద్యోగాలలో ఎంపికవడం సంతోషించదగ్గ విషయమని వారూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!