కాటారం నేటి ధాత్రి
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం గారెపల్లి అంబేద్కర్ కూడలిలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాటారం సర్పంచ్ తోటరాదమ్మ, ఉప సర్పంచ్ నాయని శ్రీనివాస్ హాజరైనారు. రజక సంఘం అధ్యక్షులు కాటారం మూసాపూర్ణ నర్సయ్య, ఉపాధ్యక్షులు గుండపెల్లి అశోక్ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కాటారంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
