కేటీకే 6 గనిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్..

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6 ఇంక్లైన్ ఎఐటియుసి ఫిట్ సెక్రటరీ శ్రీనివాస్ ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథిగా బ్రాంచ్ కార్యదర్శి రమేష్ హాజరై సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని వివరించినారు. అలాగే సింగరేణిలో ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అలాగే ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. లాభాల వాటా 35% ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో చంద్రమౌళి ఆఫీస్ బేరర్. సప్ప కృష్ణమూర్తి ఆర్గనైజర్ సెక్రెటరీ. రాజన్న వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ .అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శులు, షిఫ్ట్ ఇన్చార్జులు ,మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు, గుడి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!