కాటారం నేటి ధాత్రి:
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరం పల్లి గ్రామానికి చెందిన బోనగిరి శ్రీకాంత్ చెందిన పాడే గేదె కరెంట్ షాక్ కు గురై శనివారం మృతి చెందింది. శ్రీకాంత్ తన పాడి గేదెను మందలోకి పంపించగా గ్రామంలోని ట్రాన్స్ఫారం దగ్గర ఎర్త్ లైన్ కు తగిలి పాడి గేదే అక్కడికక్కడే మృతి చెందింది. దాని విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని గేద యజమాని తెలిపారు. ట్రాన్స్కో అధికారం నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు బాధిత రైతు ఆరోపించారు. విద్యుత్ శాఖ ప్రభుత్వం సంయుక్తంగా తనను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ విద్యుత్ షాక్ తో శంకరం పల్లి గ్రామంలో పాడే గేదలు మృతి చెందుతున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనీసం స్పందించడం లేదని తెలిపారు. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు కోరారు .