నస్కల్ రైతులు
భారీ వర్షాలు వస్తే వాగును దాటలేకపోతున్నాం అంటున్న రైతులు
ఆకేరు వాగులో నుండి వెళ్తున్న మూగ జీవాలు చనిపోయాయి
స్టేషన్గన్పూర్ నుండి తిరిగి వచ్చిన పంట పొలాల దగ్గరికి వెళ్లే పరిస్థితి దాపురించింది
నాయకులు చేస్తానంటున్నారు గానీ ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు
స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి
మా పోలాల వద్దకు వెళ్లేందుకు వంతెన నిర్మించండి బాబో అంటు ఎన్నిసార్లు స్థానిక నాయకులు వేడుకున్న ఫలితం లేదంటున్న రైతులు రైతు ప్రభుత్వం అంటూ రైతులకు ఎంతో సేవ చేస్తున్నాం అంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానిక రైతులు
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోన నష్కల్ గ్రామానికి చెందిన 250 మంది రైతుల ఆగచాట్లు ఇంత అంతా కాదు సుమారు 400ల నుండి 600 ఎకరాలు గలిగిన 250 మంది రైతులు వరి సొంత పొలాల దగ్గరికి వెళ్లాలంటే ఎన్నో అగచాట్లు పడుతున్నారు. నష్కల్ గ్రామం నుండి వ్యవసాయ బావుల వద్దకు రైతులు వెళ్లగలిగే విధంగా లేకపోవడంతో రైతులు ఎన్నో అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఇక్కడ నుండి పొలాల వద్దకి కాకుండా ఉప్పల్ కూనూర్ వయ స్టేషన్ ఘనపూర్ కు ఇదే దారి గుండానే రైతులు వెళ్లాల్సి ఉంది మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాల వల్ల ఇందులో మూగజీవాలు పడి మరణించయని పిండి బస్తాలు వేసుకుని పోయే వాహనదారులు వాగులో పడి గాయాల పాలయ్యారు 250 మంది రైతులు తల ఒక్క ఇంటికి చొప్పున 6000 రూపాయలు వేసుకొని మట్టి రోడ్డు పోయించుకున్న రైతులు వెళ్లగలిగేటట్టు చేసుకున్నాం కానీ భారీ వర్షాలు కురిస్తే ఆ మట్టి అంతా కొట్టుకుపోయే వెళ్లలేని పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అన్న రైతులు ఈ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దగ్గరికి పలుమార్లు వెళ్లిన చేస్తామంటున్నారు గానీ చేయడం లేదు ఇప్పటికైనా ఆకీరు వాగుపై వంతెన నిర్మించి రైతులను ఆదుకోవాలని ఎవరైతే తమ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారో వారికి తమ నస్కల్ గ్రామంలోని రైతుల ఓట్లతో పాటు గ్రామంలోని ఓట్లన్నీ వేస్తాం లేనిపక్షంలో ఎన్నికలలో కచ్చితంగా మా గ్రామస్తుల మందిరము కలిసి గుణపాఠం చెప్పవలసి వస్తుందని అంటున్నారు.
ఈ కార్యక్రమంలోగుంజ రఘుపతి, గంటె ఉపేందర్,
యావగోని శ్రీనివాస్, కందరపు రాకేష్, పెంజార సాయి, చేగొండ శ్రీనివాస్,
కంకటి రాజు, చేగొండ రాజకుమార్,
వడ్లకొండ నర్సయ్య,
నాకరకంటి రాజు,
చేగొండ శశికుమార్,
చేగొండ రాకేష్,
కొరివి కొమురమ్మ, చేగొండ కనుకమ్మ, వడ్లకొండ నర్సమ్మ,
గాదె పద్మ, చేగొండ కోమల,నక్క పూలమ్మ పాల్గొన్నారు.