బిఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం

 

*సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే *

*బిఆర్ఎస్ పార్టీలో చేరిన బిజెపి పార్టీ మాజీ మండల అధ్యక్షుడు

శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం బిఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందుకుంటున్నారు. కాబట్టి గండ్రదంపతుల సమక్షంలోవారి చేతుల మీదుగా భారాస పార్టీ కండువా కప్పుకున్ని పార్టీలో చేరిన మాజీ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు గిద్దమారి సురేష్ బిజెపి పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ బాసాని చంద్రప్రకాష్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్, శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి, ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్, గట్ల కనిపర్తి గ్రామ సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య, ఎంపీటీసీ బత్తిని రజిని సత్యం,సూరంపేట గ్రామ సర్పంచ్ బొల్లెడ్ల రజిత,
నరసింహులపల్లి సర్పంచ్ త్రిపురాల లక్ష్మి ,మండల నాయకులు కొమ్ముల సదానందం,గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!