ఆర్టీసి డిపో మేనేజర్ కే. ప్రసూనలక్ష్మి
అధిక ఆదాయం,డీజిల్ అదా చేసిన కండక్టర్లు,డ్రైవర్లకు సన్మానం
నర్సంపేట,నేటిధాత్రి :
గత జూలై,ఆగస్టు మాసాలలో పాటు రాఖీ పండుగ సందర్బంగా నర్సంపేట ఆర్టీసి డిపోకు అధికంగా ఆదాయం తెచ్చిన విధంగా రాబోయే
మేడారం జాతరలో సమిష్టిగా కృషిచేయాలని డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి డ్రైవర్లు, కండక్టర్లు,సిబ్బందిని కోరారు.జూలై,ఆగస్టు నెలలో అలాగే రాఖీ పండుగ సందర్భంగా అధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లను,ఎక్కువ డీజిల్ ఆదా చేసిన డ్రైవర్లను నర్సంపేట డిపోలో ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేయగా
20 మంది కండక్టర్లు,16 మంది డ్రైవర్లు,నలుగురు మెకానికులను ప్రశంస పత్రాలను అందించిన డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు నెలలో నర్సంపేట డిపోను రాష్ట్రస్థాయిలో 96 డిపోలకు గాను 14వ స్థానంలో నిలిపిన ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడ్డారని గుర్తుకు చేశారు.రాబోయే మేడారంలో జాతరలో సమిష్టిక కృషిచేసి నర్సంపేట డిపోను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. రాఖీ పండుగ సందర్భంగా సంస్థను ఆదరించి బస్సు లో ప్రయాణించిన ప్రయాణికులకు డిఎం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ భవాని, ఏ ఎం ఎఫ్ పాపిరెడ్డి,సూపర్వైజర్
సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి,ఉత్తమ ప్రతిమ కనబరిచిన సిబ్బంది
గొలనగొండ వేణు,బొమ్మెర కిరణ్ గౌడ్,పన్యా,తేజస్విని,పివి రావు,రవి,శ్రీకాంత్,రాధిక,భాస్కర్,బత్తిని రవి,పీవీ సాగర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.