వైరాఎమ్మెల్యే రాములు నాయక్ కు దళితుల స్మశాన వాటికకు 10 లక్షల నూతన సి.సి. రోడ్డు మంజూరి కొరకు

వినతి పత్రం అందించిన సింగరేణి సర్పంచ్ ఆదేర్ల స్రవంతి

కారేపల్లి నేటి ధాత్రి.

స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచిన సింగరేణి గ్రామపంచాయతీలో కుల వ్యవస్థ అలాగే ఉన్నది సింగరేణి గ్రామపంచాయతీలోని దళితులు మాదిగ, మాల,కులాలతోపాటు ఉపకులాల కు సంబంధించిన దాదాపు సుమారు 400.ల కుటుంబాలు ఉన్న.సింగరేణిగ్రామపంచాయితి లో మా తాత. ముత్తాత.ల నుండి ఎవరైనా చనిపోతే గ్రామంలో ఉన్న స్మశాన వాటికలో ఖననం చేయడానికి ఊరు పెద్దలు అంగీకరించక పోనందున దళితుల కంటూ ఒక ప్రత్యేకమైన స్మశాన వాటికను ఆనాడే ఏర్పాటు చేసుకొని ఉన్న దానినే ఉపయోగిస్తున్నారు, కానీ మా స్మశాన వాటికకు వెళ్ళిందుకు కనీసం రహదారి కూడాలేక ముళ్లపోదలుగా మారిపోయింది శవాన్ని తీసుకెళ్లడానికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న దుస్థితి ఏర్పడిందని గ్రామపంచాయతీ ద్వారా మూడు నాలుగు సార్లు ముళ్ళ పొదలను తొలగించడం జరిగింది. అయినా గాని మరల రోడ్డుపై ముళ్లపోదలు దట్టంగా మొలుస్తూ ఉన్నాయి కావున మీరు మా యందు దయవుంచి 10,లక్షల రూపాయల తోటి నూతన సీ.సీ రోడ్డును మంజూరు చేయగలరని.అదేవిదంగ దళితుల శ్మశాన వాటిక కు కాంపోండ్ వాలు ఏర్పాటు చేయాలని సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్ గాతమరిని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!