జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు
మరిపెడ నేటి ధాత్రి
ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుకొని నీట్ ర్యాంక్ సాధించి కన్వీనర్ కోటా లో ఎంబిబిఎస్ సీటు సాధించడం గొప్ప విషయం
జరుపుల తండా, బిచ్ రాజ్ పల్లి గ్రామానికి చెందిన జరుపుల నెహ్రూ అరుణ ల కుమార్తె జరుపుల గాయత్రి 2023 నీట్ పరీక్ష లో ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించింది,గిరిజన తండాలో పుట్టి ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించి గ్రామానికి వన్నె తెచ్చిన జరుపుల గాయత్రి , గాయత్రి తల్లిదండ్రులను మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గుడిపుడి నవీన్ రావు సన్మానించడం జరిగింది
ఈ సందర్బంగా నవీన్ రావు మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు గిరిజన విద్యార్థులకు అందని ద్రాక్ష లా ఉన్న ఎంబీబీఎస్ విద్యను మన సీఎం కెసిఆర్ జిల్లా కు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి పేద విద్యార్దులు కూడా ఎంబీబీఎస్ చదివేలా అవకాశం కల్పించారు అన్నారు,
కాబట్టి యువతి యువకులు అందరూ కృషి పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు పుట్టిన గ్రామానికి పేరు ప్రక్యాతలు తీసుకురావాలని అన్నారు, ఎంబిబిఎస్ సీటు సాధించిన గిరిజన బిడ్డ గాయత్రి గ్రామంలో చదువుకునే అందరికీ ఆదర్శం కావాలి అని తన తరుఫున చీరు కానుకగా 5000/- నగదు ప్రోత్సాహంగా ఇచ్చారు.