ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే దాసరి

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన దుర్గం రమ్య ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్ వెళ్లడంతో కిడ్నీ సమస్యని తేలగా నిరుపేద కుటుంబానికి చెందిన రమ్య కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి తమ బాధను వివరించగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కి తెలియపరిచి హాస్పటల్ ఖర్చు నిమిత్తం ఎల్ ఓ సి 2,50,000 రూపాయలు లాక్ చెక్కు ను కుటుంబ సభ్యులకు అందజేసారు.వెంటనే స్పందించి లాక్ చెక్ ను అందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ నాయకులు నోముల ఇంద్రారెడ్డి,నంద క్రాంతి కుమార్,గ్రామ అధ్యక్షుడు గొర్ల కుమార్,మ్యాకల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!