చేర్యాల నేటిధాత్రి…
టిడిపి జాతీయ అధ్యక్షుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక గాంధీ విగ్రహం ఎదుట టిడిపి శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు కుర్రారం బాల్ నర్సయ్య మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారన్నారు. కక్ష సాధింపుతోనే వైసిపి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని అయన మండిపడ్డాడు. ఈ కార్యక్రమంలో, పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణరెడ్డి, కొమురవెల్లి మండల అధ్యక్షుడు పబ్బోజు రాములు చారి,పాములింగం, నర్ర కేశవులు,సత్య నారాయణ, శ్రీరాముల రాజు, చంద్రం,వడ్డెర కొమురయ్య, తదితరులు ఉన్నారు.