హైద్రాబాద్ తరహా కార్పొరేట్ వైద్య సేవలను భూపాలపల్లిలో అందుతున్నాయి.
మెడికల్ కాలేజ్ ద్వారా కొత్త వైద్యులు అందుబాటులోకి రానున్నారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
మారుమూల గ్రామంగా ఉన్న భూపాలపల్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో జిల్లాగా ఏర్పడి ఆరోగ్య రంగానికి హెల్త్ హబ్ గా మారిందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. మంగళవారం మొగుల్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రత్యేక దృష్టి, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ప్రత్యేక పర్యవేక్షలో ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ప్రభుత్వ దవాఖాన పై ప్రజలకు విశ్వాసం కల్పించి, మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న ప్రభుత్వం.
ఏఎన్ఎం లు ఉన్న సబ్ సెంటర్లకు ఎంబిబిఎస్ డాక్టర్లను ఏర్పాటు చేసి, పక్క భవనాలు ఏర్పాటు చేసుకున్నాం.భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 100పడకల సామర్థ్యం ఉన్న దవాఖాన ఏర్పాటు చేసుకుని,అనేక రకాల రోగాలకు చికిత్స అందిస్తున్నారు.మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా బాధ్యతను చేపట్టిన నాటి నుంచి ఆరోగ్య రంగంలో సములన మార్పులు తీసుకొని వచ్చారు.ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు పెట్టి అమలు చేస్తున్న క్రమంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.మొగుల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులకు పక్క భవనాలు నిర్మించినం, వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండాలి.ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మొగుల్లపల్లి మండలంలో ఉన్న దాదాపు 12000 మంది మహిళలు 35సంవత్సరాలు నిండిన వారు పరిక్షలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.జిల్లా వాజ్ద్య5శాఖ అధికారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళ ద్వారా జరుగుతున్న పరీక్షల పట్ల ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలి.మా లక్ష్యం ఒక్కటే ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా అందరూ పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ యార సుజాత, ఏఎంసి కోడారి రమేష్, పిఎసిఎస్ చైర్మన్ సంపెళ్లి నర్సింగ రావు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు, సర్పంచ్ తిరుపతి రావు,చదువు అన్నారెడ్డి,స్థానిక సర్పంచ్ ధర్మారావు డిఎం అండ్ హెచ్ ఓ శ్రీరామ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఏఎన్ఎం ఆశ వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు