రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి గుడి నిర్మాణం కు భూమి పూజ కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో..గత 50 సంవత్సరాల క్రితం రజక సంఘం పెద్దలు మరిగడ్డ గ్రామంలో కోమటికుంట చెరువు ఆవరణంలో మడేలేశ్వర స్వామి గుడిని నిర్మించారు, అట్టి గుడి శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మరో గుడి దాని వెనుక భాగంలో నిర్మించాలని ఈరోజు పెద్దల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి గారు, ఉపసర్పంచ్ రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి గారు ,మరియు ఎంపీటీసీ కవ్యశ్రీ బాల్ రెడ్డి గారు, అలాగే చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నర్సయ్య మరియు గుడి కమిటీ అధ్యక్షులు కనపర్తి సత్తయ్య, మరియు రజక సంఘం మరిగడ్డ అధ్యక్షులు వనపర్తి సతీష్ ,నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు మారుపక విట్టల్ ,కార్యదర్శి పుట్టయ్య, క్యాషియర్ సాగర్, మరియు వనపర్తి మల్లేశం ,మారుపాక పరశురాములు ,గౌరవ అధ్యక్షులు మారూపక పుట్టయ్య ,మరియు మారుపక సాగర్, వనపర్తి దేవయ్య ,వనపర్తి రామస్వామి, వనపర్తి రమేష్, మారుపాక మల్లేశం ,మారూపక రామచంద్రం ,మారుపాక బిక్షపతి ,మారుపాక లక్ష్మి, మారుపాక శంకరయ్య, మరియు ప్రశాంత్ రెబల్ ,అలాగే మార్పాక తిరుపతి, మరియు సభ్యులందరూ ఈ భూమి పూజలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!