వీణవంక (కరీంనగర్ జిల్లా):
నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని కనపర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రామాలయం లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు ఏ ఆపదలో ఉన్న నేనున్నానంటూ ముందుకు వస్తున్న పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకున్నారు.అభిరుద్ది జరగాలి అంటే పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్,మాజీ సర్పంచ్ లు మహంకాళి శ్యాంసుందర్ రెడ్డి,పులి ప్రకాష్,కోమల్ రెడ్డి, రమేష్,రాజమల్లు, సదానందం,ఓదెలు, వినయ్, చరణ్, మహాదేవ్, సంపత్,రాజు,నరసయ్య, శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…..