
హనుమకొండ : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC ) ఆధ్వర్యంలో TITA అధ్యక్షుడు సందీప్ మక్తాల అధ్యక్షతన సింగపూర్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ లో సామజిక రంగం విభాగం లో తెలంగాణ నుండి ఈ.వీ. శ్రీనివాస రావు కు సామాజికసేవ అవార్డు లభించింది. ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఆధ్వర్యంలో సింగపూర్ లో ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఐటి ఇతర రంగాలలో పలువురి ప్రముఖులకు అవార్డు ప్రధానం చేశారు. దాదాపు 80కి పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఐ.టి & పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్: వీ ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్: పి. జగన్మోహన్రావు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ (APEITA) సీఈవో: కిరణ్ రెడ్డి , TITA ప్రతినిధులు: బొజ్జం రాణాప్రతాప్, పులి రవి, పుల్లూరు కిషోర్ పాల్గొన్నారు.