మంత్రి సత్యవతి రాథోడ్ కితాబు
మహబూబాబాద్,నేటిధాత్రి:
మహబూబాబాద్ పట్టణంలోని యశోద గార్డెన్ కాంప్లెక్స్ లో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాల గురుకులంలో తరగతులను గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరైన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ
సీఎం కెసిఆర్ పాలనలో గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తుండటంతో అన్ని వర్గాల విద్యార్థులు పోటీ పడి మరి విద్యను పొందుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో భారాస నాయకులు,విద్యా శాఖ అధికారులు మరియు తదితరులు ఉన్నారు.