మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్@ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

నేటిధాత్రి వరంగల్ తూర్పు

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఫోర్ట్ రోడ్ ఈద్గాలో నిర్వహించిన దావత్- ఏ- ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తో పాటు ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ పాల్గొని ముస్లిం సోదరులతో కలసి విందును ఆరగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనారిటీల పట్ల ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం తాను ఇప్తార్ విందును ఏర్పాటు చేసామని ఈ ఏడాది మరింత గొప్పగా నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్తార్ విందు విజయవంతానికి కృషి చేసిన జబ్బార్ వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటరర్లతో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ముస్లిం మత పెద్దలు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!