రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.
రామాయంపేట మున్సిపాలిటీ పట్టణ ప్రగతి ఈరోజు రామాయంపేట మున్సిపల్
పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్ మున్సిపల్ పట్టణంలోని ఎస్సీ కాలనీలో జెసిబి ద్వారా పూడికతీత పనులను పర్యవేక్షించారు. మిషన్ భగీరథ పైపు లైన్
లీకేజీ పనులు మరమ్మతులకు ఆదేశించారు. మెదక్ రోడ్ లోని పట్టణ ప్రగతి వనంలో హరితహారం కింద మొక్కలు నాటడానికి ట్రాక్టర్ ద్వారా గుంతలను తీయడం మొదలు పెట్టారు అక్కడ కూడా పనులను పర్యవేక్షించారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను సమస్యలను సేకరించి వీటిని దశలవారీగా పనులు చేపడతామని తెలిపినారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొర్రా అనిల్ ఇతరులు చింతల యాదగిరి మలయాళ కిషన్ మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్.AE యుగంధర్ . మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు రమేష్ గౌడ్ బాబు వార్డు అధికారి ఆగ మయ్య మహిళా రిసోర్స్ పర్సన్ రజిత మున్సిపల్ పర్యవేక్షణ అధికారులు కాలేరు ప్రసాదరావు శ్రీధర్ రెడ్డి వెలుగుల శ్రీనివాస్ చింతల కృష్ణ ప్రజలు పాల్గొన్నారు.