ఎ‘వరి’దీ రాజకీయం!?

రైతులను రెచ్చగొట్టింది ఎవరు?

వరి వేసేలా ఉసిగొల్పింది ఎవరు?

డప్పుయాత్రలు చేసింది ఎవరు?

కేంద్ర ప్రభుత్వంచే కొనిపించే బాధ్యత నాదన్నవారెవరు?

పరిస్ధితులను అర్ధం చేసుకోకుండా వ్యాఖ్యలు చేసిందెవరు?

ఇప్పుడు నూకలు తినమంటున్నదెవరు?

తెలంగాణ వాతావరణ పరిస్ధితులేమిటి?

ఎలాంటి పంటలకు అనుకూలమో ఎంత మందికి తెలుసు?

తెలంగాణలో రైతు రాజకీయం చేస్తున్న పార్టీలు ఒక్కసారి తెలంగాణ తల్లి విగ్రహం చూడండి. ఆ తల్లిచేతిలో ఏముందో ముందు తెలుసుకోండి….ఒక చేతిలో బతకుమ్మ…మరో చేతిలో పజ్జొనన, మొక్కజొన్న కంకులు. నీటి జాడలు లేని తెలంగాణ ఒకనాడు అరిగోస పడ్డది. తెలంగాణలో వరి పండిరచాలంటే నీళ్లు కావాలి. అందుకు ప్రాజెక్టులురావాలి. చెరువులు నిండాలి. నీళ్లతో తెలంగాణ పల్లెలన్నీ కళకళలాడాలి. ఇదీ ఉద్యమ నాయకుడు కేసిఆర్‌ కల. అంతే కాదు వరి పంట అన్నది తెలంగాణ ప్రజల కల. ఆ కల నెరవేర్చింది ముఖ్యమంత్రి కేసిఆర్‌. కాదని ఎవరూ అనలేరు? ఒక వేళ తెలంగాణ తొలి ప్రభుత్వం మరే ఇతర పార్టీ ఏర్పాటు చేసినా రాజకీయాలతోనే సరిపోయేది. కొట్లాటలతోనే పుణ్య కాలం గడిచేది. తెలంగాణలో పల్లెల్లో నీటి పరవళ్లు చూడకపోవాళ్లు…చెరువుల్లో నీటి చుక్క కనిపించేది కాదు… ప్రతిపక్షాలకు రాజకీయం మాత్రమే తెలుసు. రైతులను రెచ్చగొట్టడమే తెలుసు. రైతులను అయోమయానికి గురి చేయడమే తెలుసు. దాని వెనక వంచన మాత్రమే తెలుసు. రైతులను ఆగం చేయడమే తెలుసు. ఇది టిఆర్‌ ఎస్‌ ప్రధాన ఆరోపన. కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి, రైతులను ఆగం చేయడమేమిటి? రాష్ట్ర ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా బిజేపిని అడుగుతున్న ప్రశ్న. గతంలో ఎన్నడూ లేని కొత్తకొత్త సమస్యలన్నీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? దేశ ప్రజల ఆహారపు అలవాట్లలో ఒక్కసారిగా మార్పులొచ్చాయా? అది సాధ్యమయ్యే పనేనా? దేశంలో ప్రతి రాష్ట్రంలో అన్నం తినకుండా వుండే ప్రాంతమేదైనా వుందా? ఉత్తరాధిన చపాతిలు తినే కుటుంబాలలో కూడా నాలుగు అన్నం ముద్దలు తినకుండా వుంటారా? దేశంలో అత్యధిక వరి సాగయ్యే రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌లు కూడా వున్నాయి. అక్కడ బియ్యం కొనుగులుపై లేని సమస్య కేవలం తెలంగాణ రాష్ట్ర బియ్యం విషయంలో ఎందుకు కేంద్రం చిక్కుముడులు పెడుతోంది. మన రాష్ట్రం ఏ శీతోష్ణస్ధితి మండలంలో వుంది? మన భూమి ఏ రకానికి చెందినది? మన భూమిలో ఎలాంటి పంటలు పండుతాయన్నదానిపై అవగాహన బిజేపిలో ఎంత మంది నేతలకున్నది? సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తుంది. తెలంగాణ చరిత్ర, స్ధితిగతులు రాష్ట్ర బిజేపి నేతలు, అటు డిల్లీ పెద్దలు కూడా తెలుసుకోవాలి.  

                   దేశంలో హరిత విప్లవం వచ్చిన తర్వాత వచ్చిన వంగడాలు తెచ్చిన దిగుబడుల్లో పెరుగుల పెరిగినట్లే, తరుగు కూడా మోసుకొచ్చింది. వరిలో తాలు శాతం కూడా ఎంతో కొంత పెరిగింది. బియ్యంలో నూక శాతం కూడా పెరిగింది. అందుకు భూమి రకం కూడా కారణం. ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. మన తెలంగాణలో పండే వడ్లను బియ్యంగా మార్చే క్రమంలో నూక శాతం ఎక్కువౌతుంది. అది శీతోష్టస్ధితి మీద కూడా ఆధారపడివుంటుంది. అదే డెల్టా ప్రాంతాల్లో పండే పంటలకు ఆ పరిస్ధితి తక్కువ. ఎందుకుంటే ఆ భూమికి సహజంగానే ఎరువుల అసవరం వుండదు. కేవలం నత్రజని వేస్తే సరిపోతుంది. కాని మన తెలంగాణ భూములకు, యూరియా, డిఏపితో పాటు అనేక రకాల మందులు, పురుగు మందులు కూడా పెద్దఎత్తున అసవరం. కాని డెల్టా ప్రాంతాల్లో వుండే అతి సారవంతమైన భూముల్లో మందుల అసవరం పెద్దగా వుండదు. మన వ్యవసాయం కూడా ఖరీదే..? ఈ విషయం తెలుసుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరైంది కాదు…కొనుగోలు ప్రక్రియ రాష్ట్రానిదే అయినా, ధాన్యం సేకరణ మాత్రం కేంద్రానిది. అది ఎంతో బాధ్యతతో వ్యవహరించాలి. ఎంత సేపు మేం కొనమనడంలేదు? కాని…అంటూ పెట్టిన తిరకాసే అసలు సమస్య. ఒకే దేశం..ఒకే రేషన్‌ వుండాలంటున్న బిజేపి, ఒకే దేశం..ఒకే రకమైన కొనుగోలు ఎందుకు లేదన్న టిఆర్‌ఎస్‌ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు?

                    సహజంగా రైతులకు తమ ధాన్యం కొనుగోలౌతుందా? లేదా? అన్నదే కావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా? కేంద్ర ప్రభుత్వం కొంటుందా? అన్నది పట్టించుకోరు. కాని ఇప్పుడిప్పుడే కేంద్రం ఆడే తొండాట ఏంటన్నది రైతులు కూడా తెలుసుకుంటున్నారు. అయినా బిజేపి రాజకీయం చేస్తూనే వుంది. బిజేపి నాయకులకు ఓట్లు కావాలి. బియ్యం కొంటున్నది మేమే అన్నది ప్రచారం చేసుకోవాలి. రాజకీయం కోసం ప్రజలను, రైతులను కొంత కాలం అయోమయంలో పడేయాలి….రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి. ఇదీ బిజేపి కోరుకునేది. ఈ సమస్యను రెండేళ్లుగా ఎలా రాజకీయంగా వాడుకోవాలన్నదే బిజేపి చూస్తోంది. ఇది పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లోచైతన్యం నింపూతూనే వస్తోంది. కేంద్రం తెలంగాణ బియ్యం కొనుగోలులో కిరికిరి పెడుతోందని, వరి పంట వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు రైతులకు చెప్పింది. దాంతో ఈసారి ముప్పై లక్షల ఎకరాల్లోనే వరి పంట వేయడం జరిగింది. మిగతా పంటలపై రైతులు ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాటలపై నమ్మకం వుంచారు. పెద్దఎత్తున మిర్చి, పసుపు, పత్తి పంట పండిరచారు. ప్రస్తుతం పెద్దఎత్తున లాభాలతో అమ్ముకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి, మర్చిలకు ధర పలుకుతోందన్న వార్తలు వస్తున్నాయి. రైతులు కూడా సంతోషంగా వున్నారు. 

                    కాకపోతే ఖరీఫ్‌ పంటకు ముందు బిజేపి చేసిన రాజకీయం మూలంగా రైతులు కొంత మంది వారి మాటలు నమ్మి వరి వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దన్న మాటలను ప్రతిపక్షాలు వక్రీకరించాయి. రాజకీయం చేశాయి. ఈ మధ్య రాష్ట్ర మంత్రుల బృందం డిల్లీకి వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసింది. తెలంగాణ ప్రజలను ఎలా అవమానానికి గురిచేసిందన్నదానిపై వార్తలు చూసిందే…తెలంగాణ రైతులను నూకలు తినమని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు…అంటే తెలంగాణ రైతులు పండిరచే పంట మీద కేంద్ర పెద్దలకు వున్న చిత్తశుద్ది ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఓ వైపు ఎరువుల ధరలు పెంచడం జరిగింది. మరో వైపు సబ్సిడీలకు మంగళం పాడారు.రైతుల నడ్డి విరిస్తూనే వున్నారు. మరో వైపు వరి పండిరచాలని రెచ్చగొట్టి బిజేపి సాధించిందేమిటో చెప్పాల్సిన అసవరం వుంది. ఎవరు మాట్లాడినా రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడాలి, కాని రాజకీయం కోసం కాదు…పదవులు, అధికారం కోసం కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు కావాల్సిన అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. పెట్టుబడి కింద రైతు బంధు ఇస్తోంది. నిరంతరంగా విద్యుత్‌ అందజేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నీటి పంపిణీ జరుగుతోంది. చెరువులు నింపుతోంది. కాలువల్లో నిరంతరం నీరుండేలా చూస్తోంది. ఇక తెలంగాణలో సమృద్ధిగా వరి పంట పండితే రైతుల గోస తీరుతుందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనుకున్నారు. ఆయన కల నెరువేరుతుందని ఆశించారు. ప్రపంచంలో కొత్త వ్యవసాయ విప్లవానికి తెలంగాణను నాందిపలికేలా చేశారు. కాని కేంద్రం పిడుగులాంటి షరుతులు పెట్టడం రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టివేసింది…వారిలో ఆశలపై నీళ్లు చల్లింది…సమైక్యపాలనలో నీళ్లు లేక పంటలు పండిరచలేదు. ఇప్పుడు నీళ్లున్నా, పంటలు పండుతున్నా కేంద్రం కొనమంటోంది? ప్రకృతిపరంగా వచ్చే పంట దిగుబడి విషయంలో కేంద్రం ఇలా కొర్రీలు పెట్టడం సరైంది కాదు. తెలంగాణలో సన్న బియ్యమైనా ఇదే పరిస్ధితి. దొడ్డు బియ్యమైనా అదే స్ధితి. నూక కాకుండా బియ్యం రాదు. అందుకే బాయిల్డ్‌ రైస్‌ తయారు చేయడం. ఈ విషయాన్ని ఎన్ని సార్లు చెప్పినా కేంద్రం వినిపించుకోవడం లేదు. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనేవుంది. కేంద్రం ఇలా వ్యవహరిస్తుంటే రైతులు బిజేపిని ఎలా నమ్ముతారన్నది నాయకులు తెలుసుకోవాలి. రాజకీయం జన సంహితం కావాలి.. ప్రజా హితం కావాలి. రైతుకు సంజీవని కావాలి. అంతే కాని గరళం కావొద్దు. రైతను ఎవరూ ఆగం చెయ్యొద్దు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!