Grand Celebration of 199th Jyotirao Phule Jayanti
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కేసముద్రం/ నేటి ధాత్రి
బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో సమాజ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఉప్పునుతల రమేష్ మాట్లాడుతూ.. భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళా విద్య కోసం తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి వారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి మాట్లాడుతూ పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా నేడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, వెనుకబడిన వర్గాల (బిసి) కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం ద్వారా బిజెపి సామాజిక న్యాయాన్ని చేకూర్చిందని వారు తెలిపారు. పూలే కలలుగన్న మహిళా సాధికారత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామడుగు వెంకటాచారి, మండల ఉపాధ్యక్షులు చెలగొల్ల వెంకన్న, మండల నాయకులు లెంకలపెల్లి శ్రీనివాస్ ,బచ్చు లక్ష్మీనారాయణ ,గాంతి వెంకట్ రెడ్డి, నాయకపల్లి సర్పంచ్ గుండెల వీరన్న ,అయిత సారయ్య ,బానోత్ రాము,ధరావత్ రంగమ్మ, మండల బీజేపీ ముఖ్య నాయకులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
