Ankur Maize Demonstration Field Successful
అంకూర్ మొక్కజొన్న ప్రదర్శన క్షేత్రం అంకూర్ మొక్కజొన్న… రైతులకు సిరుల పంట
కేసముద్రం/ నేటి ధాత్రి
అంకూర్ భాను మొక్కజొన్న ప్రదర్శన క్షేత్రం శనివారం కేసముద్రం మండలం కల్వల గ్రామంలో దొనికిని వీరస్వామి అనే రైతు అంకుర్ భాను అనే విత్తనం రకం పంట సాగు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి గండి శ్రీనివాస్ మాట్లాడుతూ,
మొక్కజొన్న సాగులో అంకూర్ సీడ్స్ నాణ్యమైన దిగుబడికి మంచి పేరు పొందాయని. వీటి గురించి నాలుగు ముఖ్యమైన విషయాలు
అధిక దిగుబడి: ఈ రకం విత్తనాలు తక్కువ విస్తీర్ణంలో కూడా ఎక్కువ దిగుబడిని ఇస్తాయి.
నాణ్యమైన గింజలు: గింజలు లావుగా, ఆకర్షణీయమైన రంగుతో ఉండి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి.
తెగుళ్ల నిరోధకత: సాధారణంగా వచ్చే చీడపీడలను తట్టుకునే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుందని వివరించారు.
అన్ని కాలాలకు అనుకూలం: వాతావరణ మార్పులను తట్టుకుంటూ వివిధ రుతువులలో సాగు చేయడానికి ఇవి అనువుగా ఉంటుందని అన్నారు.
అంకుర్ కంపెనీలో భాను అనే రకం మేలైన విత్తనమని రైతులు వేసుకోవడం వల్ల అధిక దిగుబడి వస్తుందని కంకి సైజు బాగుంటుందని గింజలు ఆకర్షణీయంగా ఉంటాయని మరియు అంకుర్ కంపెనీలో భాస్కరు ఆదిత్య అనే రకము కలవని అవి కూడా అధిక దిగుబడి వస్తాయని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పెదగల రవి, దొనికని యుగంధర్, బొగ్గుల చంద్రం, పాల శ్రీనివాస్, ఆకుల సుధాకర్, కొంతం రవి, యాకూబ్ రెడ్డి, యాలాద్రి, ఉప్పలయ్య, రమేష్ పలువురు రైతులు పాల్గొన్నారు.
