Artisan Workers Protest for Job Regularization
మర్రిపల్లి మల్లంపల్లి బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి
ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ కు వినతిపత్రం
దుగ్గొండి,నేటిధాత్రి:
దుగ్గొండి మండలం మర్రిపల్లి, మహ్మదాపురం గ్రామాల ప్రజల రవాణా సౌకర్యార్థం బస్సు సర్వీస్ను మర్రిపల్లి/మల్లంపల్లి వరకు పునరుద్ధరించాలని కోరుతూ నర్సంపేట బస్సు డిపో మేనేజర్ ప్రసున్న లక్ష్మికి మర్రిపల్లి గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత,మహ్మదాపురం గ్రామ సర్పంచ్ గోగుల శ్రీనివాస్ రెడ్డి స్థానికులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయా సర్పంచులు మాట్లాడుతూ బస్సు సర్వీస్ పునరుద్ధరణతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మరియు గ్రామస్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. అధికారులు త్వరితగతిన స్పందించి సేవలను ప్రారంభించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎరుకల పద్మ, కామ సోమలక్ష్మి, కేశవరావు, గాజు శివాజీ, కుక్కమూడి రాజేందర్ పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు పొన్నాల మహిపాల్, బొడిగె రాము తదితరులు హాజరయ్యారు.
