Veterinary Camp Held in Ramachandrapuram
కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపురం గ్రామంలో కరీంనగర్ డైరీ మరియు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ద్వారా గ్రామ పాల డైరీ మరియు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు గోమాత పూజ మరియు వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈకార్యక్రమంలో కరీంనగర్ డైరీ సుధాకర్, ట్రస్ట్ సభ్యులు, పాల కేంద్రం అధ్యక్షులు కడారి రాజయ్య, సెక్రటరీ బండ అనంతరెడ్డి, సూపర్వైజర్ రాజ్ కుమార్, గ్రామ సర్పంచ్ కడారి రాజేష్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.
