New Substations Planned in Tangallapalli
కొత్త సబ్ స్టేషన్ లకు స్థల పరిశీలన. సూపరింటెండిo గ్.బిక్షపతి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి……
ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలోని కొత్త సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తూ. రామన్నపల్లెతో పాటు బదనపల్లి బస్వాపూర్. రామోజీపేట. పరిసర గ్రామాలకు నాణ్యమైన మెరుగైన విద్యుత్.సరఫరా అందించగల.మని తెలుపుతూ ఉప.కేoద్రం వలన ప్రస్తుతం ఉన్న నేరెళ్ల లక్ష్మీపూర్ మరియు తంగళ్ళపల్లి ఉప కేంద్రాలకు భారం తగ్గుతుందని తెలియజేశారు. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని రామణపల్లె గ్రామంలో. ప్రతిపాదిత.33/11. చెవి కొత్త సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేయడంతో పాటు విస్తరణ భౌగోళిక పరిస్థితులను సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన సదుపాయాలు విద్యుత్తు లైన్లో కనెక్టివిటీ వంటి అంశాలను ఆయన సమీక్షించారు. భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సబ్ స్టేషన్ను ప్రణాళిక బద్దంగా నిర్మించినట్లు అవసరమైన అన్ని సాంకేతికత ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని. ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలోని పాపాయిపల్లి గ్రామంలో.33/11. కెవి. సబ్. స్టేషన్.మంజూరు చేయబడిందని ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత పాపయ్యపల్లి గ్రామంతో పాటు తాడూరు గోపాలరావుపల్లి బేoద్రం పల్లి గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించబడుతుందని. తెలియజేస్తూ. నిర్మాణ పనులు. త్వరగా పూర్తి చేసేందుకు. చేసేందుకు భీముని మల్లారెడ్డిపేట గ్రామంలోని మరో సబ్ స్టేషన్ మంజూరు చేయబడిందని చుట్టు పక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని వివరించారు దాదాపు .7.కోట్లతో సబ్ స్టేషన్.లా నిర్మాణం చేపడుతున్నామని ఈ సందర్భంగా. N.P.D.C.L. సిరిసిల్ల సూపరిండెంట్ ఇంజనీర్ బి. బిక్షపతి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సంబంధిత సిరిసిల్ల డివిజన్ ఇంజనీర్. అంజయ్య..A.D.E .గోపీనాథ్. A.E. మధుకర్. గ్రామ సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి అనిల్. ఉపసర్పంచ్ గణపురం శ్రీనివాస్. ఆత్మకూరి రంగయ్య గ్రామ రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
