Call to Make Dalit Rights Meet Successful
వరంగల్ లో ఏప్రిల్ 17, 18 న జరుగు దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి ఎస్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయండి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో డి హెచ్ పి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ అధ్యక్షతన రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న మాట్లాడుతూ
ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళిత బంధు స్థానంలో దళితులకు అంబేద్కర్ అభయ హస్తం పేరున 12 లక్షల రూపాయ లు ఇస్తామని దళితులను దగా చేసిందని దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా
దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, బిజెపి ప్రభుత్వం ఏర్పడిన నుండి దళితుల పైన విపరీతంగా దాడులు అత్యాచారాలు పెరిగాయని బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకుని, ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోంది. రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తూ, పరోక్షంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కింది మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తోంది. మనువాద భావజాలాన్ని రుద్దడం ద్వారా సమాజాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోంది. కార్పొరేట్ సేవలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో సామాన్యుడు అల్లాడుతుంటే, సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లేలా చేస్తూ సామాజిక అసమానతలను పెంచుతోంది. తక్షణమే కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి, రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలి.
ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి.
సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం కొనసాగుతుంది. అన్ని సామాజిక శక్తులు ఏకమై ఈ నియంతృత్వ పోరాటాన్ని తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నాము. డి హెచ్ పీ ఎస్ రాష్ట్ర మహా సభలు ఏప్రిల్ 17 ,18 వరంగల్లో జరగనున్నాయి. ఈ మహాసభల్లో దళితుల అభివృద్ధి దళితులపై జరుగుతున్న దాడులు అసమాన తలపై సమగ్రమైన చర్చ జరిపి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకొని ఈ మహాసభల్లో ప్రజా పోరాటాలకు సన్నద్ధమవుతామని ప్రజలకు పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆడెపు రాజమౌళి సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి, బొంతల లక్ష్మీనారాయణ మండల కార్యదర్శి, చిప్ప నరసయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, గుండా చంద్ర మాణిక్యం, రత్నం రాజం, మేకల రాజేశం, కొంకుల రాజేష్ ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు, గోమాస గంగారం డి హెచ్ పి ఎస్ జిల్లా సమితి సభ్యులు, బొల్లం సోనీ ఎన్ ఎఫ్ ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు, నాయకులు గుండా శంకర్ గుండా ప్రశాంత్ ప్రదీప్ రాజేందర్ కిరణ్ లాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
