Respect Public Verdict: MLA
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పును గౌరవించాలి….
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిందని, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్యాతనపల్లిలో ప్రశాంతంగా ఎన్నికను నిర్వహించాలని అన్నారు. ఫిబ్రవరి 17 న జరిగిన కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం బెయిల్ షరతులలో భాగంగా బుధవారం ఆర్కేపీ పోలీస్ స్టేషన్ లో సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, కొంగల తిరుపతి రెడ్డి, మద్ది శంకర్,ఆర్నె సమ్మయ్య, యూత్ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, కుర్మ దినేష్, సీపెళ్ళి సాగర్, బెల్లం అరున్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
