Students Protest Over Education Issues
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
సోతుకు ప్రవీణ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు ప్రవీణ్ కుమార్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. బుధవారం నాడు
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని బయలుదేరుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని,విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యాసంస్థలను మెరుగుపరచాలనీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండున్నర సంవత్సరాలు గడుతున్నప్పటికీ ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రికి కేటాయించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉందని హెద్దేవ చేశారు.అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యురాలు జడల రాజేశ్వరి, జిల్లా నాయకులు పోతుల పవన్, పంగా మహేందర్, రావుల శివ, పొన్నగంటి రాజేష్, గంప రాజు లను అరెస్టు చేయడం జరిగింది.
