Workers Demand Old Medical Board System
పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలి
సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలి
ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటు పలుకుల రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_
సింగరేణిలో పాత విధానంలో నే మెడికల్ బోర్డును నిర్వహించాలని సింగరేణి కాలరేసి వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియాలో
సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్ జాతా కార్యక్రమం లో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్స్ మీద నల్ల బ్యాడ్జీలు ధరించి మెడికల్ బోర్డు,మారుపేర్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్,తదితర అంశాలపై గని మేనేజర్ పిట్ సెక్రటరీ ఎల్.శంకర్ ఆధ్వర్యంలో బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్ మెమో రాండం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. బస్ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్చి 30న కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ ముట్టడి ధర్నా కార్యక్రమం జరుగుతుందని దాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.సింగరేణిలో కొత్త బొగ్గు బావులు ప్రారంభించాలని,పాత విధానంలో మెడికల్ బోర్డును నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన
50 వేలకోట రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికు లకు సొంత ఇంటి పథకాన్ని అమ లు చేయాలని,
పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ కంపెనీ చెల్లించాలని,
కాంట్రాక్ట్ కార్మికు లకు ఐపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కోరారు.మారు పేర్లు, డిస్మిస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,
స్ట్రక్చర్ సమావే శాలలో ఒప్పుకు న్న వాటిని అమలు పరచా లని కోరారు.కెటికె
–1లో జి శ్రీనివాస్,సదయ్య,కెటికె5 లో ఆసిఫ్ పాషా,రాజేందర్,కేటికె6 లో శ్రీనివాస్,గణేష్,
కెటికె 8 శంకర్, కృష్ణ,ఓసి 2లో కరిముల్లా, రామచందర్,ఓసి 3 లో నూకల. చంద్రమౌళి,మహేందర్ రావు
ఏరియా వర్క్స్ షాప్ లో శ్రీనివాస్, కొమురయ్య లు కార్యక్రమంలో పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి గని మేనేజర్లకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శ్రీకాంత్,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ హరీష్ ,మైన్స్ కమిటీ,సేఫ్టీ కమిటీ,షిఫ్ట్ ఇంచార్జిలు, అసిస్టెంట్ షిఫ్ట్ ఇంచార్జిలు,టెంపుల్ కమిటీ,క్యాంటీన్ కమిటీ,కార్యకర్తలు,కార్మిక సోదరులు పాల్గొన్నారు.
