Outrage Over Negligence at Jadcherla Government Hospital
ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం బాధాకరం”
“ప్రజా పాలనలో పేదలకు అన్యాయం”
ఈ ఘటనపై అధికారులను సస్పెండ్ చేయాలి.
బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ డిమాండ్.
జడ్చర్ల /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం అత్యంత బాధాకరమని, ఇది ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని బాలానగర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకోవడం చాలా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

ఆసుపత్రిలో భద్రతా చర్యలు, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు
