287th Jayanti of Sant Sevalal Maharaj Celebrated Grandly
సద్గురు సేవలాల్ మహరాజ్ సేవలు మరువలేనివి
బంజారా జాతి ఐక్యం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటన
జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్
ఘనంగా సేవలాల్ మహరాజ్ 287 వ జయంతి వేడుకలు
వందలాదిగా హాజరైజన గిరిజనులు.
నర్సంపేట,నేటిధాత్రి:
బంజారా జాతి గిరిజనుల కోసం గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సేవలాల్ మహరాజ్ చేసిన సేవలు మరువలేనివని జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్ అన్నారు.సద్గురు సేవలాల్ మహరాజ్ 287 వ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామ పంచాయతీ శివారు లక్ష్మీతండాలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అలాగే వారి కుల దైవం భోగ్ బండారో వేడుక సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు.జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్
తో పాటు కుటుంబ సభ్యులు,ఆయా గ్రామాల గిరిజనులు వారి సాంప్రదాయ దుస్తుల అలంకరణతో ఆ గ్రామం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నది.బంజారా సమాజ ఆరాధ్య దైవం సద్గురు సేవలాల్ మహరాజ్ విగ్రహానికి వివిధ రకాల పంచామృత అభిషేకాలు ఘనంగా చేపట్టారు.
భోగ్ బండారో వేడుక నేపధ్యంలో అజ్మీర యాకుబ్ మహరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.నెయ్యితో చేపట్టిన ప్రత్యేక పూజలో అగ్నిజ్వాలలు ఒక్కసారిగా బారీ ఎత్తున వెలువడంతో సాక్షాత్తు వారి దేవతలు నిజస్వరూపం కనిపించిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలో బంజారా కులదైవాలు,సద్గురు సేవలాల్ మహరాజ్ నామస్మరణతో లక్ష్మీతండా మారుమ్రోగింది.బంజారా మహిళలు వారి సాంప్రదాయ వేషధారణతో పలు ఆధ్యాత్మిక భజనలు చేస్తూ నృత్యాలు చేపట్టారు.
ఈ సందర్భంగా జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్ మాట్లాడుతూ బంజారా ఆరాధ్య దైవం సద్గురు సేవలాల్ మహరాజ్ బోధనలు సమాజంలో ఐక్యత,సేవాభావాలు,నీతి నియమాలు పెంపొందించాయని పేర్కొన్నారు.ప్రస్తుత ఆధునిక సాంకేతిక వలన బంజారా సంప్రదాయాలు రోజురోజుకు వెనకపడుతున్నాయని,కొందరు సాంప్రాయాలను వదిలేసి ఇతర మతాలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బంజారా జాతి ఆవిర్భావ ప్రాంతాలైన మహారాష్ట్ర,రాజస్తాన్,కర్ణాటక రాష్ట్రాలలో పర్యటనలు చేస్తూ జాతి విశిష్టత ప్రాముఖ్యత తెలుసుకుంటున్నట్లు అజ్మీర యాకుబ్ మహరాజ్ వివరించారు.ఈ నేపద్యంలో గిరిజన బంజారా జాతి గొప్పతనాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలియపరచడానికి,ఐక్యత పెంపొందించడానికి రాష్ట్ర స్థాయిలో మహా సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.బంజారా జాతి సంప్రదాయాల వలన అనేక అద్భుతమైన ఆధ్యాత్మికత కలిగివున్నది అన్నారు.బంజారాలను సన్మార్గంలో నడిపిస్తూ అహింస అహింస సిద్ధాంతాలను ప్రబోధించడమే లక్ష్యమని
జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్ స్పష్టం చేశారు.అనంతరం అన్నదాన వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, అజ్మీర తుల్చ నాయక్,భాస్కర్ నాయక్,మంజుల, అనిల్ నాయక్,వివిధ గ్రామాల ప్రజలు,భక్తులు హాజరయ్యారు.
