Villagers Await Employment Guarantee Works
ఉపాధి హామీ పనుల కోసం ప్రజల ఎదురుచూపులు.
కారేపల్లి నేటిదాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామ ప్రజలు రైతులు రైతు కూలీలు ఈ సంవత్సరం వ్యవసాయం ఆశించినంతగా దిగుబడి రాకపోవడంతో గ్రామస్తులు పల్లెలు విడిచి హైదరాబాద్ లాంటి నగరాలకు పనుల కోసం వలస వెళ్లవలసిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు గత డిసెంబర్ నెలలో ప్రతి మిర్చి పనులు అయిపోవడంతోను ఏటువంటి కూలి పనులు దొరకక గ్రామ ప్రజలు 100 రోజుల ఉపాధి హామీ పనులు కోసం పై అధికారులను సంప్రదించిన ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇదివరకే ఉన్న ఉపాధి హామీ పనుల పాత పాస్ పుస్తకాలు పనిచేయడం లేదు కొంతమంది మాత్రమే ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. మిగతా వారికి లిస్టులో మీ పేరు లేదు అని కొత్త ఉపాధి పుస్తకాలు తీసుకొని పనిలోకి రావాలని సలహా ఇస్తున్నారు.
దయచేసి ఈ విషయమై
పై అధికారులు స్పందించి
ఉపాధి హామీ కొత్త పుస్తకాలు మంజూరు చేసి మాకు ఉపాధిహమి పనులు కల్పించి ఆదుకోవాలని రైతులు రైతులు రైతుకూలీలు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
