Vote for BRS Candidates: Mallareddy Door-to-Door Campaign at Adras Pally
బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
* అద్రాస్ పల్లి లో గడపగడప ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :
నీళ్లు రావాలన్న నిధులు కావాలన్నా కేవలం టిఆర్ఎస్ తోటే సాధ్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ని అద్రాస్ పల్లి లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అజయ్ కుమార్, నాగరాజు ల తరఫున గడప గడప ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలను కష్టాలపాలు చేస్తున్న కాంగ్రెస్ కు అవకాశం కల్పించొద్దన్నారు. ప్రజల కష్టాలు తెలిసి కన్నీళ్లు తీర్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని నేడు కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో 60 ఏండ్లు వెనకకు ప్పోయమన్నారు. మరిచిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దన్నారు. గడప గడప ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆది అజయ్, నాగరాజు లకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, యువనాయకులు డాక్టర్ భద్ర రెడ్డి, నాయకులు ఆది రమేష్, నర్సింలు, వెంకటేష్, చిరంజీవి, మల్లేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
