“Vote for Those Who Work for People: MLA Marri Rajasekhar Reddy”
పని చేసే వారిని గెలిపించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
* అలియాబాద్ 7వ వార్డులో ఎన్నికల ప్రచారం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :
ప్రజల కోసం పనిచేసే పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 7వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తంటం నర్సింహా తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎల్లుబాయి, మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు నర్సింగరావు, కుమార్, సంజీవరెడ్డి, వెంకటరెడ్డి బాబు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
