ఘనంగా జాతీయ రహదారి మాసోత్సవం ముగింపు వేడుకలు
జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని
భూపాలపల్లి నేటిధాత్రి
మహదేవపూర్ మండలంలోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి మాసోత్సవం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఎస్పీ నరేష్ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించడం, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
విద్యార్థులు రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి సమాజంలో అవగాహన పెంచే బాధ్యత తీసుకుని రహదారి ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, ఐఎంవిఐలు సుందర్ లాల్, శ్రీనివాస్, ఐరాడ్ డిపిఎం లక్ష్మణ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
