అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో రథసారథిగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుటకు ఎన్నెలేని కృషి చేసి సాధించిన విప్లవకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు. గద్దర్ చిత్రపటానికి ముందుగా పూలమాల పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మల్లయ్య మాట్లాడుతూ తన ఆటపాటతో ఉర్రుతలూగించి ఒక విప్లవ జ్యోతిగా నిలిచిన గద్దరని తెలిపారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు ఈయన 1949లో మెదక్ జిల్లాలో జన్మించాడని 2023లో అనారోగ్యంతో మరణించడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ వరకు చదివి మధ్యలో బ్యాంకు ఉద్యోగం చేశాడని చెప్పారు . రిక్షా దొక్కేరహీం అన్న రాళ్లు కొట్టే రామన్న అనే పాటతో గాయకుడిగా మారాడని తెలిపారు ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించాడని, 1997లో గద్దర్ పై హత్యాయత్నం జరిగిందని అన్నారు. పాటను ఆయుధంగా మలిచిన ప్రజా గాయకుడు అని తెలిపారు. ఆయన మరణంతో తెలంగాణ గొంతుక మూగబోయిందని అన్నారు ఆయన అణగారిన వర్గాల ప్రజలను దళితులను మహిళలను చైతన్య వంతులను చేయచూ ఆటపాటలతో ఉర్రుతలు ఊగించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు అన్నారు ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా జయశంకర్ జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ దాసారపు సాంబయ్య చందర్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు
