చేవెళ్లలో హాట్టహాసంగా కాంగ్రెస్ నామినేషన్లు
* భారీ ర్యాలీతో చేవెళ్ల కాంగ్రెస్ లో నయా జోష్.
* మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం
. :దేవర సమతావెంకట్ రెడ్డి
* చేవెళ్లలో కాంగ్రెస్ భారీ ర్యాలీతో నామినేషన్లు
* కాంగ్రెస్ ను భారీ మెజారుటీతో గెలిపించండి
* చివరి రోజు మొత్తం 71 నామినేషన్లు
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చేవెళ్ల మున్సిపల్ కాంగ్రెస్ చైర్ పర్సన్ ఆభర్థి 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దేవర సమతవెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నామినేషన్ చివరి రోజు కావటంతో మున్సిపల్ పరిధిలోని 15 వార్డులో పోటీ చేస్తున్న చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, 18 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ రెండవ సెట్టు దాఖలు చేశారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే కాలేయయ్య, డిసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, ముడిమ్యాల పిఏ సి ఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోలిపురం బలవంత్ రెడ్డి, మల్కాపురం వార్డు బక్కని యాదిరెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి వందలమంది అభిమానులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్ళి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

* గజమాలతో అభిమానుల ఘన స్వాగతం.
చేవెళ్ల మున్సిపల్ కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థి దేవర సమతవెంకట్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. నామినేషన్ దాఖాలుకు వెల్తున్న దేవర సమతకు పట్టాణకేంద్రంలోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో అభిమానులు గజమాలతో వారి అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పలికి మద్దతు తెలియజేశారు. చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ సమతావెంకట్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మహనీయుల విగ్రహాలకు నివాళిలు అర్పించారు. చేవెళ్ల మున్సిపల్ పట్టణకేంద్రంలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, పూలె విగ్రహాలకు ఎమ్మెల్యేతో కలిసి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు.
* చేవెళ్ల మున్సిపల్ అభివృద్దే నా లక్ష్యం
నామినేషన్ దాఖలు చేసిన తరువాత సమతా రెడ్డి,
చేవేళ్ల మాజీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, వార్డు అభ్యర్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.. చేవెళ్లకు సేవచేసే అవకాశం ఇవ్వాలని ఆమె ఈ సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని,
చేవెళ్లను అభివృద్ధిలో ఆదర్శ పురపాలక కేంద్రంగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో గ్రామంలో స్వంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. చేవెళ్లలో కాంగ్రెస్ బలంగా ఉందని తప్పక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందేవిదంగా కృషి చేస్తానన్నారు.

* బండారి శైలజ ఆగి రెడ్డి
చేవెళ్ల సర్పంచ్ గా సేవలందించిన బండారి శైలజ ఆగి రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ.. గతంలో చేవెళ్ల కు సర్పంచ్ గా ఆదరణ అభిమానంతో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలు మళ్ళీ తనను ఆశీర్వదించి గెలిపించి వార్డు అభివృద్ధికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేవెళ్లను చేవెళ్ల జోన్ లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. చేవెళ్ల మున్సిపల్ లోని అన్ని వార్డులలో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపాంచాలని కోరారు.
* మొత్తం 71 నామినేషన్లు.
చేవెళ్ల మున్సిపల్ 18 వార్డులకు చివరి రోజు మొత్తం 71 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 27, బిఆరెస్ 25,
బీజేపీ 16, సీపీఐ 1, ఇండిపెండెంట్,2 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నామినేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో
ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి పార్టీల అభ్యర్థులు రెండవ సెట్టు నామినేషన్ దాఖలు చేసేందుకు
పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి తరలివస్తుండటంతో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసిపి కిషన్ గౌడ్ తో కలిసి భద్రతఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
చేవెళ్ల జోన్ లో జరుగుతున్న మొయినాబాద్ చేవెళ్ల శంకర్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో 59 వార్డులు, 120 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కట్టుదిట్టమైన బద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, వివిధ వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు బండారి ఆగి రెడ్డి, బల్వంత్ రెడ్డి, జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, దావల్గరి గోపాల్ రెడ్డి,. మధుసూదన్ గుప్తా, మద్దెల శ్రీనివాస్, గంగి యాదయ్య, మల్గారి మల్లారెడ్డి, బక్కని యాదిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, 10 వార్డు శంకర్, ఎండి ఫరూక్, అశోక్, క్రిష్ణ నాయక్,
కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
