జర్నలిస్ట్ లకు రక్షణేది?
జర్నలిస్ట్ ల పై కొనసాగుతున్న దాడులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలో జర్నలిస్ట్ లపై దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిస్ట్ లపై అన్యాయాన్ని,తప్పులను ప్రశ్నించడం తప్పు అని సమాజంలో ఉండే దోపిడీ వర్గాలు బెదిరింపులకు దాడులకు తెగబడుతున్నాయి. మంచిర్యాల జిల్లా లో 63వ జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న మెగా కంపెనీ రోడ్ల పై ఓవర్ లోడింగ్ తో నిబంధనలకు విరుద్ధంగా లారీలు నడిపించింది.ప్రజలు తమకు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి అని లారీలు ఆపి ధర్నా చేసిన ఫలితం శూన్యం.ఈ సందర్భంగా ప్రొక్లెయిన్ మిషన్ రోడ్ల పై నిలపగా జైపూర్ మండలం కుందారం జర్నలిస్ట్ మార్క శేఖర్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను రోడ్ల పై నిలపకండి అనగా మెగా కంపెనీ సిబ్బంది,క్యూ న్యూస్ జర్నలిస్ట్ శేఖర్ బండి తాళం లాక్కొని దాడి చేశారు.దీనిపై జర్నలిస్ట్ శేఖర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామన్నారు.జర్నలిజం ను తిడుతూ,ప్రజల తరుపున ప్రశ్నించిన జర్నలిస్ట్ పై దాడి ఎంత వరకు సబబు అని జర్నలిస్ట్ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.ఇక్కడ ఒక్క దగ్గరే కాదు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతుందని జర్నలిస్ట్ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.జీతం లేకున్నా కేవలం సమాజ సేవకై ,ప్రజలకు,ప్రభుత్వానికి వారధిలా ఉంటూ పరిపాలనలో ముఖ్యమైన పాత్ర జర్నలిజం పోషిస్తుంది.ఇప్పటికీ నిజాయితీగా పని చేసే జర్నలిస్ట్ లకు కనీసం తమ కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.కనీసం సొంత ఇండ్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ,లోపల చిరిగిన బనియన్లు,బయట మామూలు బట్టలతో,ముఖం మీద చిరునవ్వుతో ప్రజాసేవ లక్ష్యంగా తమ జీవితాన్ని అంకితం చేస్తున్నా వారి జీవితానికి రక్షణ లేదు.జర్నలిస్ట్ లపై కేసులు వేయడం,చంపడం,దాడులు చేయడం జరుగుతున్నాయి.మరి తన మీద ఆధారపడిన కుటుంబం పరిస్థితి ఏంటి?ప్రజాస్వామ్యం లో 4వ స్థంభంగా ఉన్న జర్నలిస్ట్ లకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి.దాడుల నుండి రక్షణ కల్పించాలి.జర్నలిస్ట్ లకు ప్రత్యేక నిధులు కేటాయించి,ఉపాధి అవకాశాలు కల్పించాలి.ప్రమాదాల్లో చనిపోతున్న జర్నలిస్ట్ లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.ఇంటి స్థలాలు ఇవ్వాలి.హాస్పటల్ లలో జర్నలిస్ట్ ల కుటుంబాలకు ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించాలి.ప్రైవేట్ స్కూల్ ల్లో జర్నలిస్ట్ ల పిల్లల కు ఉచిత విద్య అందించాలి. జర్నలిస్టులపై ఎవరైనా దాడులకు దిగబడితే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
