* సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం
* కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ
*
కొత్తగూడ నేటిధాత్రి :
పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఒక వరం అని కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ అన్నారు.గురువారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీనగర్ గ్రామానికి చెందిన మహ్మద్ యాకుబ్ కు 18500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బోడ ఈర్య, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,ఈర్య నాయక్, అఫ్జల్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు యాదగిరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
