Special Amavasya Pujas at Kolluru Rameshwar Temple
అమావాస్య సందర్భంగా రామేశ్వరుని ఆలయం లో ప్రత్యేక పూజలు
భక్తులకు అన్న ప్రసాదం చేసిన డప్పుర్ సంగమేష్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు రామేశ్వరుని ఆలయంలో అమావాస్య సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు పూజారులు టేకుర్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సంగమేష్ దంపతులు అన్నప్రసాద ఏర్పాటు చేశారు. పూజలు అనంతరం అతిథులకు ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ సునీతా హన్మంత్ రావు పాటిల్, మాజీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్, సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్, యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్ ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ వివిధ గ్రామాల సర్పంచ్ లు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
