రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రజలకు అవగాహన
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రత కార్యక్రమాన్ని మొగలపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్ళపల్లి ఎస్సై బోరగాల అశోక్ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉపసర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు పంచాయతీ సెక్రెటరీ నరేష్ పాల్గొన్నారు. మంగళవారం మొగుళ్ళపల్లి మండల కేంద్ర పరిధిలో వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా నియమాల వివరించారు ఈ సందర్భంగా ఎస్సై బి అశోక్ మాట్లాడుతూ ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాలను వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని,కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని,పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని,వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, పరిమితికి మించిన వేగంతో వెళ్లకూడదని, శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదని వాహనదారులకు సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది వెంకటయ్య విజయ్ పాల్గొన్నారు
