రోడ్డు ప్రమాదాల నివారణకోసం డిఫెన్సివ్ డ్రైవింగ్ నిర్వహణ.
మండల వ్యాప్తంగా” అరైవ్ అలైవ్” పై అవగాహణ.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలం కేంద్రం లో చిట్యాల పోలీస్ వారు తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ” అరైవ్* అలైవ్ ” మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్” కార్యాక్రమం నిర్వహించడం*జరిగింది.
ఇందులో భాగంగా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని , రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని అట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికిచేరేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను* *తెలియజేయడానికి రూపోందించినది అరైవ్ అలైవ్ మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని చిట్యాల పోలీస్ స్టేషన్ సీఐ మల్లేష్ యాదవ్ ఎస్సై శ్రవణ్ , తెలియజేశారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు:*
మన రోడ్లను మరింత సురక్షితం* చేయడం, వాహన చోదకుల ఆలోచన* దృక్పథంలో మార్పు తేవడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సేఫ్ డ్రైవింగ్* *అలవర్చడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించడం, హెల్మేటు మరియు సీటు బెల్టు వాడకం పెంపు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ వాడకం గురించి హెచ్చరికలు, పాదాచారుల భద్రత మొదలగునవి తెలియజేయడం జరుగుతుంది.
ఇట్టి ‘ అరైవ్ అలైవ్ మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్” కార్యక్రమాలు ఇక మీదట అన్ని స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులలో పనిచేసే వారికి, గ్రామాలలో, రహదారికి* ఇరువైపుల గల ప్రధాన జంక్షన్లలో మొదలగు ప్రాంతాలలో చిట్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చిట్యాల పోలీస్ సీఐ మల్లేష్ యాదవ్. తెలిపారు,
*ఈ కార్యక్రమం ల్లో చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ 4వ వార్డు సభ్యులు తౌటం నవీన్, పోలీస్ సిబ్బంది మరియు చిట్యాల గ్రామ యూత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
