CPM Demands Immediate Solution to Kesamudram Railway Station Issues
రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి
కేసముద్రం/ నేటి ధాత్రి
సిపిఎం పార్టీకి కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో, రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని,నూతన అండర్ బ్రిడ్జి ప్రారంభించి పూర్తి చేయాలని, అంతవరకు ఉన్న పాత ఆర్ యు బి ని పునరుద్ధరించాలని,రెండవ ప్లాట్ ఫారం పై క్రికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, రైల్వే పరిసర ప్రాంతాల్లో కోతులు కుక్కలను నివారించాలని, మంచినీళ్లు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని రైల్వే స్టేషన్ మాస్టర్ రతన్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్షాల ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, సీనియర్ నాయకులు చాగంటి కిషన్, మోడెం వెంకటేశ్వర్లు,నీరుటి జలంధర్, జల్లే జయరాజ్, అల్పుగొండ సావిత్ర, బండి దుర్గ ప్రసాద్, తులసిమొగ్గ వెంకన్న,చిక్కుడు కవిత,పొన్నాల ఉపేందర్, తదితరులు పాల్గొనడం జరిగింది.
